తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..ఇవాళ స్కూల్స్ బంద్

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..ఇవాళ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ కు ABVP పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ బందుకు పిలుపునిస్తున్నట్లు ABVP తెలంగాణ రాష్ట్ర నాయకులు తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని, విద్యార్థులకు వెంటనే బుక్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇది ఇలా ఉండగా, తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం ఇవాళ్టి నుంచి జులై 5 వరకు ఆన్ లైన్‌లో కౌన్సిలింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో ఈనెల 28 నుంచి జులై 6వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 28వ తేదీ నుంచి జులై 8 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జులై 12న తొలి విడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news