సీఎం జగన్‌ పాలనలో ఆస్ప‌త్రుల‌కు మ‌హ‌ర్ద‌శ‌ – మంత్రి విడ‌ద‌ల ర‌జిని

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆస్ప‌త్రుల‌కు జ‌గ‌న‌న్న పాల‌న ఒక మ‌హ‌ర్ద‌శ అని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఏ ఒక్క అంశంలో కూడా రాజీలేకుండా అన్ని స‌మ‌కూర్చుతూ సువ‌ర్ణ అధ్యాయాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారు సృష్టించార‌ని మంత్రి పేర్కొన్నారు.

గాజువాక నియోజ‌క‌వర్గం క‌ణితి గ్రామంలో రూ.1.75 కోట్ల‌తో కొత్త‌గా నిర్మించిన పీహెచ్‌సీ భ‌వ‌నాన్ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.16,855 కోట్ల రూపాయ‌లతో రాష్ట్ర‌వ్యాప్తంగా గ్రామ‌స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి ఆస్ప‌త్రుల వ‌ర‌కు మొత్తం అన్నింటినీ అభివృద్ధి చేస్తున్న ఏకైక ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న‌న్న మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యే తిప్ప‌ల నాగిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news