ఓటీటీలోకి ‘మేమ్‌ ఫేమస్‌’.. ఎప్పుడంటే?

-

షార్ట్ ఫిల్మ్​తో ప్రేక్షకులను మెప్పించిన సుమంత్ ప్రభాస్ మేమ్ ఫేమస్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. కొత్త నటీనటులతో సుమంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వెరైటీ ప్రమోషన్స్​తో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంది. మ‌ణి ఏగుర్ల‌, మౌర్య‌, సార్య, సిరి రాశి, శివ నంద‌న్‌, అంజి మామ‌, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, కిర‌ణ్ మ‌చ్చా త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు.

బండ‌న‌ర్సింప‌ల్లి గ్రామ నేపథ్యంలో సాగే ఈ స్నేహితుల కథ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. మే 26న థియేటర్లలో విడుదలై, సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఇవాళ్టి నుంచి ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ లో స్ట్రీమింగ్‌ కానున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ విడుదల చేసింది.

సినిమా స్టోరీ… మయి అలియాస్ మహేశ్‌ (సుమంత్ ప్రభాస్), బాలి అలియాస్ బాలకృష్ణ (మౌర్య చౌదర్య), దుర్గ (మణి ఏగుర్ల) చిన్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులు. బండ‌న‌ర్సింప‌ల్లిలో అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతూ జీవితాన్ని స‌ర‌దాగా గ‌డిపేస్తుంటారు. వాళ్లు చేసే గొడ‌వ‌లతో ఊరి ర‌చ్చ‌బండ ఎప్పుడూ పంచాయితీల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటుంది. అయితే, ఊరిలో ప్ర‌తి ఒక్క‌రితో తిట్టించుకున్న ఈ ముగ్గురూ ఎలాగైనా ఫేమ‌స్ అయ్యి అంద‌రితో శెభాష్‌ అనిపించుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంటారు. మ‌రి, అందుకోసం మ‌యి త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఏం చేశాడు? మ‌యి, బాలిల ప్రేమ క‌థ‌లు ఏ గమ్యానికి చేరాయి? అన్న‌ది మిగతా కథ.

Read more RELATED
Recommended to you

Latest news