జులై 22న యూపీలో వన మహోత్సవ్‌-సీఎం యోగీ

-

జులై 22న ఉత్తర ప్రదేశ్‌లో పెత్త ఎత్తున వన మహోత్సవ్‌ నిర్వహించేలా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ సిద్ధమయ్యారు. ఒకేరోజు 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతేకాదు ఈ కార్యక్రమంతో సరికొత్త రికార్డును సృష్టించబోతున్నామని సీఎం అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా 5 కోట్ల మొక్కలను నాటేలా కార్యాచరణ రూపొందించామని స్పష్టం చేశారు.

YOGI

మానవ మనుగడకు చెట్లు కీలకం. ఆహారం, దుస్తులు, నివాసం,… వీటితోపాటు ప్రాణ వాయువు ఆక్సిజన్ కూడా ఎంతో అవసరం. ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీరుతున్నాయి. అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతు న్నాయి. అయితే ఇటీవలి కాలంలో అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడం పెరిగిపోతోంది. వాతావరణంలో ఏర్పడుతున్న అసమతుల్యత వలన జనజీవనం చాలా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అందుకే చెట్లు పెంచడంపైనే ప్రభూత్వాలు దృష్టి సారిస్తున్నాయి. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆడిత్యనాథ్ మొక్కల నాటే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నారు. వన మహోత్సవ్-2023 పేరుతో హరిత ఉత్తరప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

yogi

సామాన్యుల గరిష్ట భాగస్వామ్యంతో 2026-27 నాటికి రాష్ట్రంలోని మొత్తం హరిత ప్రాంతాన్ని 9.23 శాతం నుంచి 15 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం యోగి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 175 కోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూమి, గ్రామపంచాయతీ మరియు కమ్యూనిటీ భూమి, ఎక్స్‌ప్రెస్‌వే, హైవే/నాలుగు లేన్‌ రోడ్డు, కాలువ, అభివృద్ధి అధికారుల భూమి, రైల్వే భూమి, వైద్య సంస్థ, విద్యాసంస్థల భూమితో పాటు పౌరుల ప్రైవేట్ స్థలాలను ప్లాంటేషన్ కోసం వినియోగిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. . ఉపయోగించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానం చుట్టూ మొక్కలు నాటాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో కనీసం వెయ్యి మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ లబ్ధిదారుడు తన భూమిలో కనీసం 200 మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే మూడేళ్లలో రూ.50వేలు ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందజేస్తుందని తెలిపారు. గంగా, యమునా, సరయూతో పాటు వివిధ నదుల తీర ప్రాంతాల్లో ఇంటెన్సివ్ ప్లాంటేషన్ కోసం ప్రజలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news