కేసీఆర్‌ సర్కార్‌పై కేంద్రం ప్రశంసలు..వ్యవసాయరంగం అద్భుతం !

-

కేసీఆర్‌ సర్కార్‌పై కేంద్రం ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఐటీ అనుసంధానం చేసిన విధానాన్ని కేంద్రం పొగిడింది. ఖరీఫ్‌ సీజన్‌ సన్నద్ధతపై గురువారం హైదరాబాద్‌లో కేంద్ర వ్యసాయ శాఖ జాయింట్ సెక్రటరీ డా. యోగితా రాణా.. తెలంగాణ వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించగా “పర్ డ్రాప్ మోర్ క్రాప్” పథకాన్ని అమలు చేయడంలో అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు.

తెలంగాణలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని, 2014-15లో 129.04 లక్షల ఎకరాలు ఉన్న సాగు 2022-23 నాటికి 232.58 లక్షల ఎకరాలకు పెరిగిందని తాజాగా కేంద్ర ప్రభుత్వ రిపోర్టులో పేర్కొంది. వరి సాగు విస్తీర్ణం 2014లో 22.74 లక్షల ఎకరాలు నుంచి 2022లో 64.99 లక్షలకు ఎకరాలకు పెరిగిందని వెల్లడించింది. తెలంగాణలో విత్తనాలు, ఎరువుల నిల్వలు తగినంత ఉన్నాయని, 950కి పైగా ఆగ్రో రైతు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news