ప్రధాని మోదీ కోసం యూఏఈ అధ్యక్షుడు ప్రత్యేక మెనూ ఏర్పాటు… !

-

ప్రస్తుతం భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ దేశాలకు ఎక్కడికి మోదీ వెళ్లినా ఆయనపై ఉన్న గౌరవమో లేదా మన దేశంపై ఉన్న అభిమానమో తెలియదు కానీ అద్భుతంగా ట్రీట్ చేస్తారు.. ఇక తాజాగా యూఏఈ పర్యటనలో కూడా మోదీని ఒక రేంజ్ లో గౌరవమర్యాదలు ఆ దేశ అధ్యక్షుడు షైక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ చూపించడం విశేషం. ముఖ్యంగా మోదీ భోజన ఏర్పాట్లను ప్రత్యేకంగా ప్లాన్ చేశారు యూఏఈ ప్రెసిడెంట్. స్వతహాగా మోదీ శాఖాహారి కావడం వలన ఆ స్టైల్ లోనే అన్ని ఆహారపదార్ధాలను తయారు చేయించి ప్రత్యేకంగా ఒక మెనూని ప్లాన్ చేశారు. ఈ మెనూలో ఉన్న అన్ని వంటకాలు కూడా సేంద్రీయ కూరగాయలతో తయారుచేసినవే.

ఇందులో సలాడ్ : హారీస్ , స్థానిక కూరగాయలతో చేసిన డేట్స్ సలాడ్ .. స్టార్టర్స్ : గ్రిల్డ్ వెజిటేబుల్స్ విత్ మసాలా సాస్, మెయిన్ కోర్స్: స్థానిక గోధుమలతో చేసిన హారీస్, క్యారెట్ లు , కాలీఫ్లవర్, డెసర్ట్: స్థానిక పండ్లు. ఈ విధంగా మోదీకి ప్రత్యేక మెనూను యూఏఈ అధ్యక్షుడు ఏర్పాటు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news