వైసీపీ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు : విజయసాయి రెడ్డి

-

వైసీపీ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ చేశారు. 30 పార్టీలతో ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం, 24 పార్టీలతో బెంగళూరులో విపక్షాల భేటీ జరుగుతున్నాయి… 2024 సంవత్సరంలో వైసిపి పార్టీ మద్దతుతోనే కేంద్రంలో ఏ ప్రభుత్వం అయినా అధికారం చేపడుతుందని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు విజయ్ సాయి రెడ్డి.

అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దీవెనలు మరియు ఓట్ల ఆశీర్వాదం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని జాతీయ మీడియా సర్వేలలో వైసిపి భారీ విజయం సాధిస్తుందని రిపోర్టులు వచ్చాయని విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. కాగా..కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా నేడు, రేపు బెంగుళూరులో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల భేటీ జరగనుంది. చాలాకాలం తర్వాత సోనియా గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మొత్తం 24 పార్టీలకు ఆహ్వానం పలికామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశంపై చర్చలు సాగనున్నాయి. సీఎం సిద్ధరామయ్య నేతలకు విందు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news