బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి : వివేక్‌ వెంకటస్వామి

-

జగిత్యాల జిల్లాలో మాజీ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన పలు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ధర్మారం పట్టణంలో గోదావరిఖని కౌన్సిలర్ బట్వాత్ శంకర్ నాయక్ తల్లి మృతి చెందగా.. వారిని పరామర్శించారు. వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన బుపెల్లి విజయ్ గుండె పోటుతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

vivek venkataswamy counter to cm kcr

మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి టిఫిన్ బైటక్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేరబెళ్లి రఘునాథ్ రావు, నాయకులు రజనీష్, బొప్పు కిషన్, ప్రభాకర్ రాజన్న, హరి గోపాల్, తిరుపతి, వెంకటేశ్వరరావు, తాజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news