వచ్చే 25 ఏళ్లు భారత్​కు చాలా కీలకం : ప్రధాని మోదీ

-

కాంగ్రెస్​పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత యూపీఏ పాలనపై మోదీ ధ్వజమెత్తారు. యూపీఏ సర్కార్ తమ స్కామ్​లతో బ్యాంకింగ్ రంగాన్ని సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆ స్కామ్​ల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయని అన్నారు. తమ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్యాంకులు నెమ్మదిగా కోలుకున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో బ్యాంకింగ్ రంగం బలోపేతమవుతోందని మోదీ తెలిపారు. వచ్చే 25 ఏళ్లు భారత్​కు చాలా కీలకమని అన్నారు.

‘రోజ్‌గార్‌ మేళా’లో భాగంగా మోదీ ఈరోజు.. మరో 70వేలకు మందికి పైగా నియామక పత్రాలను అందజేశారు. అనంతరం వర్చువల్​గా ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఫోన్‌ బ్యాంకింగ్‌ (బ్యాంకులకు ఫోన్లు చేసి)తో ఆ ప్రభుత్వం రూ.వేల కోట్ల రుణాలను వారికి అనుకూలంగా ఉన్న కొందరు శక్తిమంతమైన నేతలు, కుటుంబాలకు మంజూరు చేయించిందని మోదీ ఆరోపించారు. ఆ రుణాలు తిరిగి రాకపోవడం వల్లే ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలను చవిచూశాయి. నిరర్ధక ఆస్తులు విపరీతంగా పెరిగాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news