సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

-

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మైహోం సిమెంట్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్ ఫోర్ ప్లాంట్ వద్ద 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాదంపై మై హోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితులు ఉత్తర ప్రదేశ్, బీహార్ కి చెందిన వారిగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news