చంద్రబాబు వల్ల కరువు వస్తే.. జగన్ వల్ల కరోనా వచ్చిందా..? – సోమిరెడ్డి

-

వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిడిపి పొలిట్ బ్యురో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకాని వ్యవసాయ మంత్రిగా అనర్హుడని అన్నారు. వ్యవసాయం గురించి ఏం తెలుసని కాకాని నోరు పారేసుకుంటున్నాడని మండిపడ్డారు సోమిరెడ్డి. వైసీపీ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతుందని ఆరోపించారు.

రైతులకు అందే కేంద్ర ప్రయోజిత కార్యక్రమాలను కూడా నిలిపివేసేందుకు సిగ్గు అనిపించడం లేదా..? అని నిలదీశారు. చంద్రబాబు వల్ల కరువు వస్తే.. జగన్ వల్ల కరోనా వచ్చిందా..? మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరువును చంద్రబాబు ధైర్యంగా ఎదుర్కొన్నాడని అన్నారు. శాఖలో అవినీతి జరుగుతోందంటూ ఆగ్రోస్ చైర్మన్ సీఎం జగన్ కి రాసిన లేఖపై మంత్రి ఏం సమాధానం చెబుతారు..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news