ఏపీలో మిస్ అయిన అమ్మాయిల వివరాలు వెల్లడించిన కేంద్రం… !

-

రెండు వారాల క్రితం ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సంచలన కామెంట్ చేశాడు, ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల నుండి సేకరించిన వ్యక్తిగత సమాచారం వలన మహిళలు కిడ్నాప్ కు గురవుతున్నారు అనడంతో, రాష్ట్రము మొత్తం అట్టుడికిపోయింది. ముఖ్యంగా వాలంటీర్లు ఆగ్రహావేశాలతో పవన్ పై రెచ్చిపోయి మాట్లాడారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుండడంతో ఈ విషయాన్ని లోక్ సభలో లేవనెత్తడంతో కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతమంది మహిళలు తప్పిపోయారు అన్న విషయాన్ని బయటపెట్టింది. కేంద్ర హోమ్ శాఖా తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 2019 నుండి 2021 వరకు 7928 మంది బాలికలు మరియు 22278 మంది మహిళలు మిస్ అయ్యారని తెలియచేసింది.

ఈ వివరాల ప్రకారం అస్సలు వాస్తవంగా ఎంతమంది మిస్ అయ్యారన్న విషయం బయటపడింది. కానీ నిజంగా ఏ కారణాల వలన వీరు మిస్ అయ్యారు అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news