ఇవాళ్టి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దు

-

ఇవాళ్టి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దు అయింది. నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దు అయింది. వచ్చే సోమ, మంగళవారాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్… బాధితులకు అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుని ఆదుకోవాలని ఆదేశించారు.

ఆదివారం సాయంత్రానికి సీఎం ఓ కార్యాలయం ముఖ్యమంత్రి జగన్ పర్యటన కార్యక్రమాన్ని అధికారికంగా విడుదల చేస్తుంది. ఇక అటు ఇవాళ విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు సీఎం జగన్‌. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఏ కన్వెన్షన్‌ సెంటర్‌‌లో ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకలలో పాల్గొననున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news