తెలంగాణలో ఫోటోగ్రాఫర్లకు శుభవార్త.. ఆ పథకాలకు దరఖాస్తు చేసుకోండి : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

-

మంగళవారం ఫోటోగ్రఫి వ్యవస్థాపకుడు లూయిస్‌ జ్యాక్విన్‌ మాంజ్‌ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్ల సంఘం శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో నిర్వహించిన మహాసభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కలిసి పని చేసిన ఫోటో గ్రాఫర్లను ఆదుకోవడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆయన. వారికి గుర్తింపు కార్డు అందిస్తామని వెల్లడించారు.

Leaders trying to malign image will face action: Srinivas Goud

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఫోటోగ్రాఫర్లకు భవనలకు స్థలం కేటాయిండంతో పాటు భవన నిర్మాణం చేసి ఆదుకున్నట్లు తెలిపారు మంత్రి. ఎస్సీలకు దళితబంధు, బీసీలకు బీసీ బంధు, మైనార్టీలకు కార్పొరేషన్‌ ద్వారా ఆదుకుంటున్నట్లు వెల్లడించారు ఆయన. అర్హులైన ఫోటోగ్రాఫర్ల్లు వారి వారి సామాజిక వర్గాలలో సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news