BREAKING : వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల

-

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల చేసింది జగన్‌ సర్కార్‌. కాసేపటి క్రితమే 4వ విడత నిధులను విడుదల చేశారు సీఎం జగన్.. 9.48 లక్షల డ్వాక్రా గ్రూపు ఖాతాల్లో రూ.1358.78 కోట్లు జమ చేశారు సీఎం జగన్‌. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ…అక్కాచెల్లెలు చల్లగా ఉంటే కుటుంబం క్షేమంగా ఉంటుందని తెలిపారు.

మహిళల పక్షపాతిగా ముందడుగు వేశామన్నారు. సున్న వడ్డీని ప్రతి ఏడాది క్రమం తప్పకుండా విడుదల చేస్తామన్నారు. 4 సంవత్సరాల్లో 4960 కోట్లు సున్న వడ్డీ అందించామని.. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేసి 1402 కోట్లు చెల్లించకుండా రోడ్డుపై నిలబెట్టారని వివరించారు. 2016 నుండి సున్న వడ్డీ పథకం రద్దు చేసి మోసం చేయడం నారా వారి చరిత్ర అంటూ విమర్శలు చేశారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news