వారం రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు – కోమటిరెడ్డి

-

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో నకిరేకల్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తలను కోమటిరెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు అవుతారని తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో చాలామందికి రైతుబంధు అందలేదని విమర్శించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదిన్నర గంటలు మాత్రమే కరెంటు ఇస్తుందని ఆరోపించారు. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ సమావేశం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరబోతున్నారనే నేపథ్యంలోనే ఈ విషయంపై కార్యకర్తలతో చర్చించేందుకు కోమటిరెడ్డి సమావేశమైనట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news