నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి !

-

ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉంది. 2024 లో జరగనున్న ఎన్నికలలోనూ విజయభేరి మోగించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ప్రతి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా రాజకీయాలు టాక్ అఫ్ ది స్టేట్ గా ఉండేవి. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానాన్ని వైసీపీ తరపున పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. కానీ ఈసారి ఎన్నికల్లో చాలా మార్పులు చోటు చేసుకోవడంతో, ఆదాల నెల్లూరు రురల్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయనున్నారు. అదే సమయంలో నెల్లూరు ఎంపీ గా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వేమిరెడ్డి స్వయంగా మీడియా సమావేశంలో ప్రకటించి నన్ను నెల్లూరు పార్లమెంట్ ప్రజలు ఆశీర్వదించాలని కోరుకున్నారు. ఇంకా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లోనూ జగన్ అన్న ప్రభుత్వమే వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు వేమిరెడ్డి.

మరి నెల్లూరు నగర ఎమ్మెల్యే సీటును ఎవరికీ ఇవ్వనున్నారు ? మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ కు ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news