హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు శంకుస్థాపన

-

హైదరాబాద్‌లోని బోయినపల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ & ట్రైనింగ్ సెంటర్కు కాంగ్రెస్ అగ్రనేతలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ విజయభేరి మీటింగ్ ఆరు గ్యారంటీలను ప్రకటించారు సోనియా గాంధీ. మహాలక్ష్మి స్కీమ్‌ ద్వారా నెలకు రూ. 2,500 ఇస్తామని..రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు సోనియా. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

మరోవైపు సోనియాగాంధీ తెలంగాణకి తల్లి లాంటివారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కొనియాడారు. మాట తప్పని, మడమ తిప్పని నేత సోనియా అని చెప్పారు. కేసీఆర్ గుండెలు అదిరేలా సోనియాకు స్వాగతం పలికామని రేవంత్‌రెడ్డి తెలిపారు. సోనియా సందేశం కోసం తెలంగాణ ఎదురుచూస్తోందన్నారు రేవంత్‌రెడ్డి. రాజీవ్‌గాంధీ నాలెడ్జ్‌ సెంటర్‌ను సోనియా గాంధీ ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు నా నమస్కారాలంటూ సోనియా గాంధీ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అమలు చేస్తామని సోనియా తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని.. అప్పుడే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని, ఇదే తన కోరిక అని సోనియా గాంధీ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news