చిత్తూరు జిల్లా జనసేన నాయకులతో నాగబాబు సమావేశం

-

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు రెండు రోజులపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల నిమిత్తం 23వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ఆరోజు తిరుపతిలోని బస చేసి నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో విడివిడిగా సమావేశం అవుతారు. మొదట నియోజకవర్గ స్థాయి క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలతో సమావేశమై.. ఆ తరువాత ఆయా నియోజకవర్గాల నాయకులతో భేటీ అవుతారు.

ఈ సమావేశాలలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ పై దిశా నిర్దేశం చేస్తారు. మొదటిరోజు 23వ తేదీన తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, గంగాధర, నెల్లూరు, చంద్రగిరి నియోజకవర్గాల కార్యకర్తలు నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. 24వ తేదీన పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు, కుప్పం, మదనపల్లి, తంబళ్లపల్లి, చిత్తూరు నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తారు. ఇక అదే రోజు సాయంత్రం తిరుపతి నుండి తిరుగు ప్రయాణం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news