నేను కష్టంలో ఉన్నప్పుడు కోహ్లీ ఇంటర్వ్యూలు చదివాను: పీవీ సింధు

-

ఇండియాలో దిగ్గజ మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ గా గుర్తింపు దక్కించుకున్న వారిలో తెలంగాణకు చెందిన పీవీ సింధు ఒకరు. ఈమె ఒలంపిక్ మెడల్ దక్కించుకుని తన ఖ్యాతిని ఇంకా పెంచుకుంది. ఇక తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి కొన్ని కీలక విషయాలు పంచుకుంది. ఈమె మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని… కష్టంలో ఉన్నప్పుడు మళ్ళీ నేను చాలా ఓపికగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అధిగమిస్తూ వచ్చానని ఆమె పేర్కొన్నారు పీవీ సింధు. ఇక ఇలా నేను కష్టాల్లో ఉన్న ప్రతి సారీ ఈమె ఓవర్ కం కావడానికి కారణంగా క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఇంటర్వ్యూ లను చూస్తూ నాలోని శక్తిని పెంపొందించుకున్నట్లు సింధు తెలిపింది. విరాట్ కోహ్లీ ఎంతోమందికి ఒక ప్రేరణ లాంటి వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తింది పీవీ సింధు.

ఈయన ఇంటర్వ్యూ లే నాకు కష్టాలను తట్టుకుని పైకి లేచే స్ఫూర్తిని ఇచ్చాయంటూ ఈమె పేర్కొంది. కాగా సింధు చాలా కాలంగా మంచి ఫామ్ లో లేకపోవడం చాలా బాధాకరం. త్వరలోనే తిరిగి పుంజుకోవాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news