ఒంగోలులో కామ పిశాచి.. బాలికలతో సెక్స్, అసహజ చర్యలు !

-

[tps_header][/tps_header]

ఒంగోలులో ఓ కామ పిశాచి ఉదంతం కలకలం రేపుతోంది. మాయమాటలతో బాలికలను లొంగతీసుకుని వారితో అసహజ పద్దతుల్లో శృంగారం జరుపుతున్న ఓ మాయలాడి ఉదంతం సచలనం కలిగిస్తోంది. చూడటానికి పద్దతిగా కనిపించే మహిళ… ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని మగాడిలా వేషధారణ వేసుకుని బాలికలను ఆకర్షిస్తోంది. మగాడిలా ప్రేమలేఖలు రాస్తూ బాలికలను బుట్టలో వేసుకుంటోంది.

ప్రత్యేకించి టీనేజ్ బాలికలను టార్గెట్ చేస్తూ సుమలత అనే ఈ మహిళ వారిని ఇళ్లకు తీసుకొచ్చి.. మత్తుమందు ఇచ్చి అసహజ లైంగిక చర్యలు చేస్తోంది. ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో ఈ డొంకంతా కదులుతోంది. ఈ విషయం బయటకు తెలియడంతో ఆమె భర్త ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కూడా.

వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 4వ తేదీన తనకు మత్తు ఇచ్చి కొందరు లైంగిక దాడి చేశారంటూ 17 ఏళ్ల బాలిక స్పందనలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఏడుకొండలు ఇంటికి వెళ్లి తనిఖీలు చేస్తున్న సమయంలో బ్యాగులో కృత్రిమ జననాంగాలను పోలిన వస్తువులు కనిపించాయి. లైంగిక చర్యకు ఉపయోగించే కృత్రిమ పరికరం, నడుముకు చుట్టుకునే బెల్టు వంటివి పోలీసులకు దొరికాయి.

అంతే కాదు.. ఆమె కాల్ డేటాలో అనేక మంది మైనర్లను ట్రాప్‌ చేసినట్లుగా గుర్తించారు. పోలీసులు సుమలతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్‌ విధించారు. ఒంగోలు జిల్లా జైలుకు తరలించారు. మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన భర్త ఏడుకొండలు మృతదేహానికి స్థానిక ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లికి అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news