నీ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారన్న నెటిజన్‌.. కౌంటర్‌ ఇచ్చిన ఏక్తాకపూర్‌

-

‘థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌’ ప్రమోషన్స్‌లో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు నిర్మాత ఏక్తా కపూర్‌. ‘నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం తెలుసుకో’ అంటూ పలువురు దూషించారు. విమర్శలను ఏమాత్రం లెక్క చేయని ఆమె వారికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. నీ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు, మంచి సినిమాలు చేయడం తెలుసుకో అంటూ వ్యాఖ్యానించిన నెటిజన్‌కు నిర్మాత ఏక్తాకపూర్ నా ఇష్టమున్న సినిమాలు తీస్తానంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో నటించిన త్యాంక్యూ ఫర్ కమింగ్ సినిమా అక్టోబర్ 6న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆస్క్ మి ఎనీథింగ్ అంటూ ఎక్స్ వేదిక పైకి వచ్చారు.

Ekta Kapoor Recalls Her Initial Years Of Entering The Entertainment Industry

ఈ క్రమంలో నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు, కరణ్ జోహార్ కలిసి చాలామందిని చెడగొడుతున్నారని, చాలామంది విడాకులకు మీరిద్దరే కారణమని పేర్కొన్నారు. దీనిపై ఏక్తాకపూర్ స్పందిస్తూ… అవునా అని ఒక్కమాటతో వదిలేశారు. ఆ తర్వాత మరో నెటిజన్ దయచేసి మీరు అడల్ట్ సినిమాలు చేయడం మానండి అని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ… నో, నేనొక అడల్ట్, కాబట్టి అడల్ట్ సినిమాలే చేస్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news