ఎన్నికల్లో గెలిచి గ్యారెంటీలను అమలు చేస్తాం : రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా ఇవాళ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తాజాగా కరీంనగర్ లో రాహుల్ గాంధీ బస్సు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చాం.. ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


నేను ఇక్కడికి అబద్దాలు చెప్పడానికి రాలేదు. ఒక కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. 200లోపు ఉచిత కరెంట్ ఇస్తాం, 500 సిలిండర్ ఇస్తాం, రైతు భరోసా ద్వారా రూ.15వేలు ఇస్తాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి కల్పిస్తాం. ఎన్నికల్లో గెలిచి గ్యారెంటీలను అమలు చేస్తాం. ఎప్పుడూ రాజీ పడను.. సిద్దాంతాలకోసం పోరాడుతానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తున్నట్టు స్పష్టంచేశారు. మోడీకి అవసరం ఉన్నప్పుడల్లా కేసీఆర్ మద్దతు ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news