పబ్లిక్, ప్రైవేటు ప్రాజెక్టు పనుల్లో ఇలాంటి విచారణలు సాధారణమే : మేకపాటి విక్రమ్

-

వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు అయింది. గురువాయూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ జీఐపీఎల్ కంపెనీ డైరెక్టర్ గా మేకపాటి విక్రమ్ రెడ్డి ఉన్నారు. ఈ కంపెనీ కృష్ణ మోహన్ కన్‌స్ట్రక్షన్స్‌ కేఎంసీ అనే కంపెనీ అనుబంధ సంస్థ.

ఇది మేకపాటి కుటుంబానికి చెందినది. కేరళలో ఓ జాతీయ రహదారి నిర్మాణం కోసం అనుబంధ సంస్థ జీఐపీఎల్ ను ఏర్పాటు చేశారు. రోడ్ పూర్తిగా నిర్మించకుండా.. బస్ షెల్టర్లు కట్టకుండానే టోల్, ప్రకటన చార్జీల రూపంలో భారీగా డబ్బులు సంపాదించినట్లుగా ఈ కంపెనీపై ఆరోపణలుఉన్నాయి. అయితే రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా, బస్ షెల్టర్లు నిర్మించకుండా… టోల్ చార్జీలు, ప్రకటన చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఈ కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈడీ పలు చోట్ల సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. జీఐపీఎల్ డైరెక్టర్ గా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. దీనిపై మేకపాటి విక్రమ్ రెడ్డి స్పందించారు.

50 ఏళ్లుగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యాపార రంగంలో ఉన్నామని తెలిపారు. పబ్లిక్, ప్రైవేటు ప్రాజెక్టు పనుల్లో ఇలాంటి విచారణలు సాధారణమేనని వ్యాఖ్యానించారు. తమ కంపెనీపైనే కాదని, తమతో కలిసి పనిచేస్తున్న మరో కంపెనీపైనా విచారణ జరిగిందని విక్రమ్ రెడ్డి వెల్లడించారు. ఈడీ కోరిన డాక్యుమెంట్లు ఇచ్చామని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. 2019లో వైసీపీ గెలిచాక మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి అయ్యారు. అయితే ఆయన హఠాన్మరణం చెందడంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. గౌతమ్ రెడ్డి వారసుడిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని కుటుంబం బరిలో దింపింది. సీఎం జగన్ ఆశీస్సులు కూడా ఉండడంతో మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news