రాబోయే ఎన్నికల్లా డబుల్ మెజారిటీతో గెలిపించాలే: కేసీఆర్

-

ఈ రోజు కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభలలో దేవరకొండ సభ కూడా ఒకటి. తెలంగాణాలో ఎన్నికలు మరింత దగ్గర పడుతున్న వేళ విరామం లేకుండా వరుసగా సభలలో పాల్గొంటూ ప్రజల ఆశీర్వాదం కోసం తన పాలనను చెప్పుకుంటున్నాడు కేసీఆర్. ఇక తాజాగా దేవరకొండ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నేను దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఉద్యమం నుండి వచ్చిన బిడ్డను అని పరిచయం చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో రానున్న ఎన్నికలలో మీ పార్టీ BRS ను డబుల్ మెజార్టీ తో గెలిపించాలని కోరారు కేసీఆర్. ఇక్కడ సభకు వచ్చిన జనాలను చూస్తేనే అర్ధమవుతోంది నన్ను తప్పక గెలిపిస్తారని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. మీరంతా మేము అందించిన పాఠాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వెయ్యాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో గెలిచిన అనంతరం మళ్ళీ దేవరకొండకు వచ్చి మీతో మాట్లాడుతానంటూ కేసీఆర్ ముగించారు.

కాగా ప్రజల ఆశీర్వాదం ఈ ఎన్నికల్లో ఎవరికీ ఇస్తారు అన్న విషయంపై అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఏమి జరగనుంది అనేది తెలియాలంటే నెలరోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news