చంద్రబాబును పరామర్శించనున్న కేటీఆర్ ?

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇటీవలే రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో.. జైలు నుంచి కోర్టు రిలీజ్ చేసింది. నాలుగు వారాల పాటు చికిత్స నిమిత్తం ఇంటి దగ్గరే ఉండనున్నారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ కాగానే… రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ కార్యకర్తలు ర్యాలీ తీశారు. అనంతరం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు చంద్రబాబు.ఇలాంటి తరుణంలోనే ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబును పరామర్శించడానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్తున్నాడంటూ ఒక వర్గానికి చెందిన కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అయితే… ఇదంతా పూర్తిగా అవాస్తవం అని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని మీడియా సంస్థలు కావాలనే ఇలా ప్రచారం చేస్తున్నాయని బీఆర్‌ఎస్‌ పేర్కొంది.హైదరాబాద్‌ లో చంద్రబాబు తీసిన ర్యాలీ నేపథ్యంలో ఆయనపై ఇవాళ మరో పోలీసు కేసు కూడా నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news