చంద్రబాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్…వ్యూహాలు షురూ!

-

ఈ రోజు కాసేపటి క్రితమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హైదరాబాద్ లోని తన నివాసంలో , జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో వెళ్లి కలవడం జరిగింది. ఈమధ్యనే చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉండి అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ రావడంతో విడుదల అయ్యాడు.. అది కూడా కేవలం నాలుగు వారాలు కావడం గమనార్హం. కాగా 50 రోజులకు పైగానే జైలులో ఉన్న చంద్రబాబును కలిసి అసలు ఏమి జరిగింది ? విచారణలో ఏమి అడిగారు ? లాంటి చాలా విషయాలను తెలుసుకోవడానికి పవన్ వెళ్లి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. తద్వారా తమ పొలిటికల్ గేమ్ ను మరో యాంగిల్ లో స్టార్ట్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారట.

ఆంధ్రప్రదేశ్ లో 2024 లో జరగనున్న ఎన్నికల్లో ఎలా అయినా సరే గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలన్న కాంక్షలో పవన్ చంద్రబాబులు ఉన్నారు. మరి వీరి కోరిక తీరుతుందా ? మరోసారి జగన్ నుండి వీరికి దెబ్బేనా అన్నది తెలియాలంటే మరో నాలుగు నెలలు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news