బీజేపీ నేతలు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా : తుల ఉమ

-

తెలంగాణాలో సరిగ్గా 19వ రోజున ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న BRS గెలుపు కోసం చూస్తుండగా, ఒక్కసారి గెలుపు రుచి చూడాలని బీజేపీ మరియు మరోసారి కాంగ్రెస్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సీట్లు కేటాయింపులలో అసంతృప్తితో ఉన్న చాలా మంది నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. తాజాగా వేములవాడ నియోజకవర్గం లో పోటీ చేయడానికి బీజేపీ టికెట్ ను ఆశించిన తుల ఉమకు ఆఖరి నిముషంలో వేరే వ్యక్తికి ఆ టికెట్ ను ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి లోనయింది. తుల ఉమ మాట్లాడుతూ, ఇక మీదట బీజేపీ నేతలు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. తనను నమ్మించి మోసం చేయడానికి సిగ్గుండాలంటూ ఆవేదనతో కూసిన కోపాన్ని ప్రదర్శించారు తుల ఉమ.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేవలం అగ్ర కులాల వారికే కొమ్ము కాస్తున్నారంటూ సెన్సషనల్ కామెంట్స్ చేశారు తుల ఉమ. రాష్ట్రంలో బీసీ లను అణగదొక్కలని చూస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news