వైట్ హౌస్ కు రండి-ఏపీ బడి పిల్లలకు అమెరికా ఆహ్వానం

-

ఏపీ బడి పిల్లలకు మరోసారి అంతర్జాతీయ ఆహ్వానం
వచ్చే మార్చ్ 5న అంతర్జాతీయ సదస్సు
నానోటెక్నాలజీపై మాట్లాడేందుకు రమ్మని పిలుపు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న పాలన దేశానికే ఆదర్శమని తరచుగా వింటున్నాం. సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారు.సంక్షేమ పథకాలను నేరుగా గడప వద్దకే చేరుస్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొంటున్నారు ఏపీ సీఎం జగన్‌. నాడు-నేడు స్కీమ్‌తో పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దారు.అంతే కాకుండా విద్యావ్యవస్థలో ఇటీవల కీలక మార్పులు తీసుకువచ్చారు ముఖ్యమంత్రి. తదనుగుణంగా విద్యార్ధులు మంచి ఫలితాలను సాధిస్తున్న పేదింటి పిల్లలు తమ ప్రతిభతో అంతర్జాతీయ మేధావుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీ బడి పిల్లలకు ఇప్పుడు మరో అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించి ఎందరో మేధావులను ఆకట్టుకున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దేశవిదేశాల విద్యావేత్తలనుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు వారికే మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం లభించింది. 2024 మార్చి 5న అమెరికాలో జరగనున్న నానో టెక్నాలజీ సదస్సుకు రావాల్సిందిగా విద్యార్థులకి ఆహ్వానం అందింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వ్యోమగాములతో పాటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సలహాదారు, భారత సంతతికి చెందిన ఆర్తి ప్రభాకర్‌తో కలిసి మన విద్యార్థులు ఆ వేదికపై మాట్లాడే గొప్ప అవకాశం వారికి దక్కింది. ఆప్టిక్స్, విద్య, వైద్యం, ఉత్పత్తి, తయారీ రంగం,మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి అంశాలమీద విద్యార్థులు అక్కడ ప్రసంగిస్తారు.

ఏపీ విద్యావ్యవస్థలో మొదలైన సంస్కరణలు, అవి సాధిస్తున్న ఫలితాలకు అభినందనలు, ప్రశంసలు దక్కడం ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబర్లో అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొని ఆయాదేశాల ప్రతినిధులతో కలిసి అక్కడి పాలనావిధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాలమీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సామాజికాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలకపాత్ర పోషిస్తాయి అనే అంశాలమీద చర్చలు..

విద్యావేత్తలు, ఆర్థిక, సామజిక వేత్తలతో భేటీలు నిర్వహించారు. పదిమంది విద్యార్థులు పదిహేను రోజులపాటు కొలంబియా , స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాలమీద అవగాహన పెంపొందించుకున్నారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులను, దానికోసం సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంస్కరణలు గురించి వివరించారు. రాష్ట్రంలో అమ్మఒడి, మనబడి నాడు- నేడు, విద్యాకానుక వంటి పథకాలు విద్యావ్యవస్థను ఎంతగా బలోపేతం చేసిందీ వంటి అంశాలను పిల్లలు అక్కడి ప్రతినిధులకు వివరించారు. అంతేకాకుండా మన ప్రభుత్వం విద్యకోసం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించి అక్కడ మేధావుల మెప్పు పొందారు. తాజాగా ఇప్పుడు మరో సదస్సుకు పిలుపు అందుకున్నారు. అంతర్జాతీయ సంస్థల ఆహ్వానంతో ఏపీ పేదింటి పిల్లల ప్రభ మరింతగా పెరగాలని ఆశిద్దాం

Read more RELATED
Recommended to you

Latest news