నాగార్జున సాగర్ సమస్యకు టీడీపీ ప్రధాన కారణం: వైసీపీ ఎంపీ

-

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలు విడిపోయిన అనంతరం నాగార్జున సాగర్ కు సంబంధించిన కాలువ సమస్య మొదలైంది. వాస్తవంగా విభజన చట్టం ప్రకారం చాలా విషయాలు ఇంకా పరిష్కారం కాకుండానే ఉండిపోయాయి. తాజాగా ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. నాగార్జున సాగర్ సమస్యకు కారణమే టీడీపీ అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ పట్ల పూర్తి అధికారాన్ని తెలంగాణ చేతిలో పెట్టింది టీడీపీ అంటూ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని విజయసాయి రెడ్డి గట్టిగా చెప్పారు. మన భూభాగంపై ఉన్న కాలువ పైన తెలంగాణ పెత్తనాన్ని సహించేది లేదంటూ ఫైర్ అయ్యారు విజయసాయి రెడ్డి.

ఇక ముందు ముందు ఈ సమస్య పరిష్కారానికి జగన్ ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్నది తెలియాల్సి ఉంది. ఈ కామెంట్స్ పై టీడీపీ నుండి కానీ లేదా తెలంగాణ నుండి కానీ ఎవరైనా స్పందిస్తారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news