ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

-

తొలిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఎయిర్ ఫోర్ట్ నుంచి నేరు పార్లమెంట్ కి వెళ్లారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి తిరిగి ఇవాళ రాత్రి వరకు హైదరాబాద్ కి చేరుకోనున్నారు. 

కేవలం నిన్న 11 మంది మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు. మిగిలిన కొంత మందికి మంత్రిగా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరనున్నారు. తొలుత పార్లమెంట్ లోకి మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి రాజీనామా చేయనున్నారు రేవంత్ రెడ్డి. క్యాబినెట్ లో మిగతా బెర్తులపై అధిష్టానంతో చర్చించనున్నారు. రాహుల్ గాంధీని కలిసే అవకాశమున్నట్టు సమాచారం. ఎవరెవరికీ ఏ మంత్రి పదవీ కేటాయించాలనేది ఇవాళ అధిష్టానంతో భేటీ తరువాత క్లారిటీ రానుంది. కొత్త మంత్రుల గురించి రాహుల్ గాంధీ చర్చించిన తరువాత నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news