ఉద్దానంలో 742 కోట్లతో వైయస్ఆర్ సుజలధార

-

  • కిడ్నీ బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్‌
  • శాశ్వత పరిష్కార దిశగా అడుగులు
  • 50 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య రాజకీయ పార్టీలకు మేనిఫెస్టోలో అంశం అయ్యిందే తప్ప పరిష్కారానికి నోచుకుంది లేదు.దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు ఈ సమస్యను పెడచెవిన పెట్టినవే.ప్రాణాలు పోతున్నాయి మహాప్రభో అంటున్నా తిరిగి చూసిన వారే లేరు.కేవలం రాజకీయ లబ్ది కోసమే తప్ప గత ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు. కంటి తుడుపు చర్యలు తప్ప పీడిత ప్రజలకు ఒరిగింది శూన్యం.ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్న సీఎం జగన్‌ తాజాగా ఉద్దానం సమస్యపై దృష్టి సారించారు. పాదయాత్ర సమయంలో అక్కడి ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశారాయన. ఆస్పత్రుల్లో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి బాధలను విన్నారు.ఖచ్చితంగా తాను అధికారంలోకి వస్తే వారి బాధలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఆనాడే హమీ ఇచ్చారు.

ఉద్దానం పీడిత జనానికి అండగా నిలబడతానని ఇచ్చిన హమీ మేరకు పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సుమారు 50 కోట్లకు పైగా ఖర్చుచేసి ఆస్పత్రి నిర్మించారు.దీనికి “డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌’గా ప్రభుత్వం నామకరణం చేసింది. కిడ్ని వ్యాధికి గల మూల కారణాల పై పరిశోధన చేసి నివేదిక సిద్దం చేసింది. రోగం వచ్చాక ట్రీట్ మెంట్ చేయడం కాకుండా రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళిక సిద్దం చేశారు. కార్పోరేట్ స్థాయి వైద్యం ఇక నుండి ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కిడ్ని రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలంపుతో జగనన్న ఇచ్చిన హమీ మేరకు ఆస్పత్రి నిర్మాణం చేయడమే కాకుండా, రోగానికి మూలమైన నీటిని వాడకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సుమారు 700 కోట్ల రూపాయలతో నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం చూపారు సీఎం జగన్‌.

ఉద్దాన ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో సుజలధార ప్రాజెక్టును జగనన్న ప్రభుత్వం నిర్మించింది. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్లు చొప్పున నీటిని సరఫరా చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం.ఈ నెల 14న ( గురువారం ) సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభంకానుంది.ఉద్దానం కిడ్ని రోగులకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న జగన్‌ను శ్రీకాకుళం జిల్లా వాసులు గుండెల్లో పెట్టుకున్నారు. ఇన్నెళ్ళకు తమ సమస్య పరిష్కారం కాబోతుందని జిల్లా వాసులు ఆనందపడుతున్నారు. బతుకుపై ఆశను కలిగించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు.గత ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. కంటితుడుపు చర్యలుగా మాత్రమే చేసి పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప తమ సమస్యలను పరిష్కరించలేదు. అయితే సీఎం జగన్‌ అండగా నిలిచారని ఉద్దానం ప్రాంతవాసులు కొనియాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news