పద్మవిభూషణ్‌కు ఎంపికైన మెగాస్టార్ కు మంత్రి కోమటిరెడ్డి సన్మానం

-

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిరుకు అభినందనుల తెలిపారు. ఇకా తాజాగా రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లి చిరంజీవికి అభినందనలు తెలుపుతూ సత్కరించారు. పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన చిరంజీవి ప్రస్థానం రేపటి విశ్వంభరదాక విజయవంతంగా సాగుతుందని తెలిపారు. రక్తదానం, నేత్రదానం ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు వరించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజుతోపాటు మరికొంత మంది సినీ ప్రముఖులు చిరంజీవిని కలిసి అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news