మమ్మల్ని గర్వించేలా చేశారు: అల్లు అర్జున్

-

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించింది. గతంలో పద్మ భూషణ్ అవార్డు పొందిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా పద్మ విభూషణ్ అవార్డును అందుకోనున్నాడు. ఒక కానిస్టేబుల్ కొడుకుగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా కష్టపడి 150కి పైగా సినిమాలలో నటించాడు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయము అందించాడు. పద్మ విభీషణ్ అవార్డు రావడంతో చిరంజీవికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా..మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించడంపై హీరో అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. ‘దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారానికి ఎంపికైనందుకు చిరంజీవి గారికి అభినందనలు. కుటుంబం, అభిమానులతోపాటు యావత్ తెలుగు వారికి ఇది ఎంతో గర్వకారణం. ఈ విజయంపై సంతోషంగా ఉన్నా. మా అందరినీ గర్వించేలా చేసినందుకు ధన్య వాదాలు’ అని ఆయన ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news