మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

-

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తాజాగా కీలక ప్రకటన చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గళం బలంగా వినిపించేందుకు కృషి చేయాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన వాటి గురించి ప్రశ్నించాలని సూచించారు. రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ పైనే ఉన్నాయని ఎంపీలకు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవ్వరు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో మరోసారి చూపిద్దామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై ఆసక్తికర వార్త ఒకటి వైరల్ అవుతుంది. మరోసారి కరీంనగర్ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు కరీంనగర్ కేసీఆర్ కి సెంటిమెంట్ అనే సంగతి అందరికీ తెలిసింది ఈ క్రమంలోనే కరీంనగర్ నుంచి ఎన్నికల ప్రచారానికి దిగాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news