వైసీపీలో చేరిన మాజీ కలెక్టర్ ఇంతియాజ్ ….. ఎమ్మెల్యేగా పోటీ!

-

మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్లుగా ప్రతినిధ్యం వహించిన కలెక్టర్లు ఇకపై పొలిటికల్ గా తమ ప్రతిభను చూపనున్నారు.తాజాగా కర్నూలు మాజీ కలెక్టర్ ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతియాజ్ను కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం కూడా వెంటనే ఆమోదించింది. కాగా ఏఎండీ ఇంతియాజ్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి నుంచి ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. ఇంతియాజ్ స్వస్థలం కర్నూలు జిల్లాలోని కోడుమూరు. కర్నూలులో బంధువర్గం, పరిచయాలతో ఆయన సునాయాసంగా గెలవగలరని వైసీపీ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news