పోలీసులపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదులుతున్నానని.. ఏపీ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. తూర్పు గోదావరి పిఠాపురంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ..తెదేపా ఎంపిగా ఉండి ప్రభుత్వ వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అదే విధంగా ఆగ్రహంతో ఆనాలోచితంగా నాలుకలు కోస్తామని పోలీసు సంఘం ప్రతినిథులు అనడం కూడా సమర్థనీయం కాదని తెలిపారు. రాష్ట్రంలో పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు సంయమనంతో స్పందించాల్సి ఉంటుందని రాజప్ప వ్యాఖ్యానించారు. సామన్య ప్రజలకు ఎవరు ఇబ్బంది కలిగించిన ప్రభుత్వం ఉపేక్షించదని ఆయన పేర్కొన్నారు. ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులు స్థానికులపై దాడి చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం.. హోం మంత్రి
-
Previous article
Next article