కేరళ సీఎం కూతురు పై మనీ లాండరింగ్ కేసు

-

కేరళ  సీఎం పినరయి విజయన్  కుమార్తె వీణా విజయన్ తోపాటు మరికొందరిపైనా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  అక్రమ నగదు చలామణి చట్టం  కింద కేసు నమోదు చేసింది. ఆమెకు చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దీని విచారణకు సంబంధించి వీణాతో పాటు మరికొందరికి త్వరలో సమన్లు జారీ చేయనుంది.


కొద్ది రోజుల క్రితం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వీణాతోపాటు ఆమె సంస్థ, మరికొందరిపై ఈడీ పీఎంఎల్ఎ కేసు నమోదు చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్  అనే సంస్థ వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్  కంపెనీకి 2018-19 మధ్య అక్రమంగా రూ.1.72 కోట్లు చెల్లింపులు చేసినట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. కొచ్చిన్ మినరల్స్కు ఎక్సాలాజిక్ ఎలాంటి సర్వీస్ ను అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ పేర్కొంది. దీంతో, ఎక్సాలాజిక్పై ఎస్ఎఫ్ఎస్ఐఓ విచారణ జరిపి అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు వెల్లడించింది. మరోవైపు ఎస్ఎఫ్ఎస్ఐఓ విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news