పార్టీని వీడుతున్న నేతల విషయంలో పవన్‌ కళ్యాణ్‌ సంచలన నిర్ణయం !

-

పార్టీని వీడుతున్న నేతల విషయంలో జనసేన పార్టీ చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేడు మంగళగిరికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అసంతృప్తితో పార్టీనీ విడుతున్న నేతలపై ఫోకస్ పెట్టనున్నారు. అలాగే.. సీనియర్ నేతలను బిజ్జగిస్తున్నారు పవన్ కళ్యాణ్‌. ఇవాళ మంగళగిరి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయం లో ఇంటర్నల్ సమావేశాలు ఉంటాయి.

Pawan Kalyan’s sensational decision regarding leaders leaving the party

ఈ సందర్భంగా అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్ నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పనున్నారు పవన్. ఇప్పటికే జనసేనకు గుడ్ బై చెప్పారు పలువురు సీనియర్ నేతలు. మరికొంతమంది పక్క చూపులు చూస్తూ ఉండటంతో అప్రమత్తం అయింది జనసేన. అటు నేడు పవన్ తిరుపతి వెళ్ళే ఛాన్స్ ఉంది. తిరుపతి అభ్యర్థిని మార్చాలంటున్నారు జనసేన ఇంఛార్జ్‌ కిరణ్ రాయల్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జేబీ శ్రీనివాస్ సహా పలుపురు నేతలు. దీంతో అసంతృప్తి నేతలతో సమావేశం కానున్నారు పవన్.

Read more RELATED
Recommended to you

Latest news