పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ అటెంప్ట్: సజ్జల రామకృష్ణ రెడ్డి

-

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపి పై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పై దాడిని నాటకం అంటూ తెలుగుదేశం పార్టీ మూర్ఖంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘ఇది ఆకతాయిలు చేసింది కాదు.. పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ అటెంప్ట్. జగన్పై దాడి పిరికిపంద చర్య’ అని ఆయన విమర్శించారు. జగన్పై దాడి టీడీపీ కుట్రేనని మంత్రి పెద్ది ఆరోపించారు. సీఎం జగన్ను అంతమొందించేందుకే దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు.

కాగా, నిన్న విజయవాడలో సీఎం జగన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి దగ్గర గాయమైంది.రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది. CMRF హరికృష్ణ గారు ఫస్ట్ ఎయిడ్ చేశారు .ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది.

 

Read more RELATED
Recommended to you

Latest news