ఏపీ విద్యార్థులకు అలెర్ట్…ఈ నెల 25న ఏపీఆర్జేసీ, డీసీ సెట్ పరీక్షలు

-

ఈనెల 25న అప్రజక్, డీసీసెట్-2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. APRJCకి 32,666 మంది దరఖాస్తు చేసుకున్నారని…. వీరికి ఉ.10 నుంచి మ. 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.

అలాగే డీసీసెట్ కు 56,949 మంది దరఖాస్తు చేసుకున్నారని…..వీరికి రేపు మ. 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు కనీసం గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

కాగా, తెలుగు రాష్ట్రాల్లోనే పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు మొదలుకానున్నాయి. జూన్ 12 స్కూల్ పునః ప్రారంభమవుతాయి. సెలవుల్లో ప్రైవేట్ స్కూళ్లు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. కాగా సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ విద్యాశాఖ ‘సెలవుల్లో సరదాగా’ కార్యక్రమాన్ని నిర్వహించామంది.

Read more RELATED
Recommended to you

Latest news