విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి స్కూళ్లకు సెలవులు

-

తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలెర్ట్. తెలుగు రాష్ట్రాల్లోనే పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు మొదలుకానున్నాయి. జూన్ 12 స్కూల్ పునః ప్రారంభమవుతాయి.

సెలవుల్లో ప్రైవేట్ స్కూళ్లు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. కాగా సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ విద్యాశాఖ ‘సెలవుల్లో సరదాగా’ కార్యక్రమాన్ని నిర్వహించామంది.

కాగా, తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఏప్రిల్‌ 24వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news