ఏ ఆగస్టులో రుణమాఫీ చేస్తారో క్లారిటీ లేదు : కేసీఆర్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడు కానీ ఈ ఏడాదేనా అనేది క్లారిటీ లేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. రైతు సంఘాలు కూడా ఇదే విషయాన్ని తనతో ప్రస్తావించాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే శాపంగా ఉందని రైతులు భావించారని పేర్కొన్నారు. ఏ ఊరుకు వెళ్తే.. ఆ ఊరిలో సీఎం ఓట్లు పెట్టడం హాస్యస్పదంగా మారిందన్నారు. నీటి విషయంలో నిర్వహణ లోపించిందని.. దీంతో పంటలు ఎండిపోయాయని చెప్పారు.

నేటితో ముగియనున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర

బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించబోతుంది. రాష్ట్రం దివాళ తీసిందని ఏ పిచ్చి ముఖ్యమంత్రి చెప్పరు. అది రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీస్తుంది.   తెలంగాణ ఏర్పడిన కొత్తలో ధనిక రాష్ట్రంగా ఉండేది. ప్రస్తుత ముఖ్యమంత్రి అసెంబ్లీలో అక్కసుతో మాట్లాడరాని భాషలో మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news