బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు..!

-

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతున్న తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు అయ్యింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోండగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన ఓటును వినియోగించుకునేందుకు మంగళ్ హాట్ పరిధిలోని ఎస్ఎస్ కే జూనియర్ కళాశాలకు వెళ్లారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన ఆయన పోలింగ్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎన్నికల స్కాడ్ ఫిర్యాదు మేరకు మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు.

అలాగే హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై కూడా కేసు నమోదు అయ్యింది. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు హైదరాబాద్ పార్లమెంట్ పాతబస్తీలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆమె.. మహిళల బర్దా తొలగించి పరిశీలించారు. దీనిపై ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ స్పందిస్తూ.. మాధవీలతపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news