జహీరాబాద్ లో కాంగ్రెస్ విజయం ఖాయం : షబ్బిర్ అలీ

-

లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ గెల్చుకుంటుందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 11 ఎంపీ సీట్లను గెలుస్తుందని అన్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీంమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని,కేసీఆర్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని అన్నారు. నిన్న తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పువ్వు గుర్తుకు ఓటెయ్యమని చెప్పడం నిదర్శనం అని షబ్బీర్ అలీ అన్నారు.

కేసీఆర్ తన కూతురు కవితను జైలు నుంచి బెయిల్ పై బయటకు తీసుకురావడానికి కేసీఆర్ బీజేపీతో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకున్నాడని షబ్బీర్ అలీ మండిపడ్డారు. నిన్నటి వరకు దేశంలో ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రధానమంత్రి అవుతారని చెప్పిన కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీకి అమ్మిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని విమర్శించారు.5 నెలలలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని అన్నారు. బీజేపీ పార్టీకి అమ్ముడుపోయిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news