ప్రపంచపటం మీద భారత ఔన్నత్యాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి మోడీ : ఈటల రాజేందర్

-

వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భగా.. నల్లగొండ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విద్యార్థి దశనుండి వారి సమస్యల గురించి పోరాడినవారు. నలభై ఏళ్లుగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు అని ఈటల రాజేందర్ అన్నారు. 34 నియోజకవర్గాలకు 34మంది ఇంచార్జీలను నియమించుకొని పనిచేస్తున్నాం. బీజేపీ చారిత్రాత్మక సన్నివేశంలోకి ప్రవేశించింది. ఈ రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించే పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారు.

మోదీగారి పదేళ్ల పాలన చూసి ప్రజలందరూ ఆయనవైపు మొగ్గుచూపుతున్నారు. ఖమ్మంలో సైతం బీజేపీ ప్రభావం ఉంది. బుద్ధిజీవులు, యువకులు, చదువుకున్నవారు బీజేపీవైపు ఉన్నారు. ప్రపంచపటం మీద భారత ఔన్నత్యాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి మోడీ గారు అని ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రులు కూడా బీజేపీని గెలిపించాలని భావిస్తున్నారు అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇర్రెలవెంట్.ప్రేమేందర్ రెడ్డి మీ గొంతుక అవుతున్నారు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news