మీరు డిస్ క్వాలిఫై చేయకుంటే ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తా : రఘునందన్ రావు

-

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్న కలిశారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయాలని కంప్లెంట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టడమే లక్ష్యంగా ఒక్కో ఓటర్కు రూ.500 చొప్పున డబ్బులు పంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే చాలాసార్లు పోలీసులకు కంప్లెంట్ చేశానని.. ఎవరూ పట్టించుకోవడం లేదని కూడా పేర్కొన్నారు.

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఫామ్ హౌజ్ నుంచి డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. బూత్ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్లలో ఒక్కో గ్రామానికి డబ్బులు పంపిణీ చేశారని చెప్పారు. తాను 20కి పైగా కార్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే ఒక్క కారును పట్టుకొని పోలీసులు హడావిడి చేశారని అన్నారు. తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉందని మెదక్ పోలీసులు భావిస్తున్నట్లు కంప్లెంట్లో రఘునందన్ రావు మెన్షన్ చేశారు. ఇక్కడ న్యాయం జరుగకపోతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news