NTR తెలుగు జాతి చిహ్నం : సీఎం రేవంత్ రెడ్డి

-

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్మరించుకుంటున్నారు. చిత్ర పరిశ్రమలో ఆయన పోషించిన పాత్రలను, దేశ, తెలుగు రాజకీయాల్లో ఆయన తీసుకొచ్చిన సమూల మార్పులను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.

‘ఎన్టీఆర్.. తెలుగుజాతి చిహ్నం. ఆ మహనీయుడి 101 జయంతి సందర్భంగా ఘన ‘నివాళి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు ‘ప్రముఖ చలనచిత్ర నటులు, నటరత్న, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి డా. నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని వారికి ఘననివాళులు అర్పిస్తున్నాను.’ అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా, గతేడాది తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news