బ్రేకింగ్‌: భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. షాక్ ఇచ్చిన వెండి..

-

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు భారీగా పైకెగ‌సింది. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయలు పెరిగింది. దీంతో 39,960 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 36,650 రూపాయలకు చేరింది. కాగా, వెండి ధర కూడా భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి కేజీకి ఒక్కసారిగా 440 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,300 రూపాయల వద్ద నిలిచింది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 250 రూపాయలు పెరిగింది. దీంతో 38,650 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 250 రూపాయల పెరుగుదల నమోదు చేసి 37,450 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 440 రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 47,300 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news