టీడీపీ ఎంపీ కేశినేని నానిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..!

-

టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని నివాసంలో గృహ నిర్బంధం చేశారు. అమరావతి ప్రాంత రైతులు కొనసాగిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈమేరకు చర్యలు తీసుకున్నారు. మరోవైపు, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. రైతుల ఆందోళనకు విపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. కాగా, హైకోర్టు తరలింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల యూనైటెడ్ అడ్వకేట్ యాక్షన్ కమిటీ తలపెట్టిన ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

అయితే.. ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగే ధర్నాకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. రైతులు, రాజకీయ నేతలతో కలిసి ప్రకాశం బ్యారేజీ వద్ద లాయర్లు తలపెట్టిన ధర్నాకు అనుమతి నిరాకరించినట్లు తేల్చి చెప్పారు. అక్కడ ధర్నాతో ప్రజల రాకపోకలకు ఆటంకం ఎదురవుతుందని, అదీకాక.. అది పురాతన కట్టడం కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెబుతూ అనుమతి నిరాకరించారు. అటు.. సచివాలయానికి వెళ్లే మార్గాలు, చుట్టుపక్కల గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ముళ్లకంచెలు, బారికేడ్లను భారీగా ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news